Friday, October 11, 2013

భారత రాష్ట్ర పతి గారికి బహిరంగ లేఖ

భారత రాష్ట్ర పతి గారికి ,

' మడిసన్నాక కాసంత సిగ్గుండాలి ' అని తెలుగులో నాటు సామెత వుంది . మీ క్యాబినెట్ మంత్రులకు అదే లేదు . ఆ విషయం రాహుల్ గారికి తెలిసే నేరస్తులను రక్షించే ఆర్డినెన్స్ ను చించేసి ఉత్తమ పౌరుల జాబితాలో చేరాడు .
పార్లమెంటు లోకి నేరస్తులకు ఆహ్వానం పలికే ఆర్డినెన్స్ ను ఆమోదించిన మంత్రులకు  ఆంధ్రప్రదేశ్   రాష్ట్రము ను విభజించే నైతిక హక్కు లేదు .
2009 సెప్టెంబర్ లో ముఖ్య మంత్రి రాజ శేఖర రెడ్డి గారు చనిపోతే హొమ్ మంత్రి హోదాలో చిదంబరం డిసెంబర్ మాసం తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ప్రక్రియ మొదలు కాబోతున్నదని  ప్రకటించిన వెంటనే    రాష్ట్ర విభజన కుట్ర కు డిల్లి దర్బారులో రూప కల్పన జరిగిందని తెలుగు ప్రజలు గుర్తించారు . సోనియా గాంధీ అనుమతి పొందడానికి K . చంద్రశేఖర రావు తో నిరాహార దీక్ష నాటకం ఆడించారు .
2014 లోక్ సభ ఎన్నికల తర్వాత అవసరమనిపిస్తే తెలంగాణ రాష్ట్రము ఏర్పాటు చేయండి. అందుకు సహకరిస్తాం .
అలా కాకుండా హడావిడిగా రాష్ట్ర విభజన చేయడమంటే ఆంధ్రాసీమ ప్రజలను మోసగించడమే .
5 కోట్ల మంది తెలుగు ప్రజలు మీ భారత దేశానికి భారమైతే 'Republic of Andhra Seema ' గా మనుగడ సాగించ డానికి మేము సిద్ధమే . భారత దేశ పౌరులుగా మనుగడ సాగించడం మాకు గర్వమే. కానీ డిల్లి దర్బారుకు సామంత రాజ్య పౌరులుగా మనుగడ సాగించడం తెలుగు మీసాలకు ఇష్టం లేదు .
GOM లో వున్న మీ మంత్రులు మా తెలుగు జాతి శత్రువులుగా మేము భావిస్తున్నాం .

మీ బెంగాలి మనసుకు మా హృదయ ఘోష అర్ధ మౌతుందని ఆశిస్తున్నాను.
Sentiments are more powerful in Kashmir than in Telangana. Indian government had paid heavy penalty by hurting Sikh and Tamil sentiments. It is time for India to rectify the mistakes of past.                                                                                         
                                                                                            భవదీయుడు
                                                                                       బొమ్ము మోహన రెడ్డి
                                                                                      Andhra Seema Vani   

 

Sunday, September 22, 2013

తెలుగు సింహం

నేను భారతీయుడనా కేంద్ర ప్రభుత్వానికి బానిసనా ?

ఈ ప్రశ్న మదిలో ఉదయించిన నాటి నుండి త్రివర్ణ పతాకము విదేశీ జెండా వలె అగుపిస్తోంది . కేంద్ర ప్రభుత్వము సిక్కులను మోసం చేసింది. సిక్కు తుపాకి ఇందిరా గాంధిని బలి తీసుకుంది . కేంద్ర ప్రభుత్వము తమిళులను మోసం చేసింది . తమిళ మానవ బాంబు రాజీవ్ గాంధి ని బలి తీసుకుంది. నేడు కేంద్ర ప్రభుత్వము తెలుగు జాతిని మోసం చేయడానికి సమాయత్త మౌతోంది. తెలుగు వారి కోపానికి భారత దేశము బలి కాపోతోంది . ఆంధ్ర ప్రదేశ్  విభజన భారత దేశ విచ్చిన్నము నకు సంకేతం. ఐదు కోట్ల మందిని వారి రాజధాని నుండి గెంటి వేయడం దేశ బహిష్కరణ శిక్ష లాంటిది. ఈ భారత ప్రభుత్వానికి బానిసలుగా జీవించాల్సిన అధమ స్థితి నుండి బైట పడాలంటే ఆంధ్రా సీమ వాసులు తమ భూ భాగాన్ని రిపబ్లిక్ గా మార్చుకునేందుకు ఉద్యమించాలి.
ఉద్యమ తొలి దశ : ఉత్తర భారతీయుల వ్యాపార సంస్థలను ఆంధ్రా సీమ నుండి బహిష్కరించండి.
            చిదంబరం మంత్రిగా కొనసాగుతున్నంత కాలం తమిళనాడు నుండి వస్తువులను దిగుమతి చేసుకో రాదు .
            పెప్సీ' కోలా ఉత్పత్తులను నిషేధించండి.
                                                                                    బొమ్ము మోహన రెడ్డి

                                                                  తెలుగు సింహం

Tuesday, September 10, 2013

ఆంధ్రా సీమ ఉద్యమం

ఆంధ్రా సీమ  ఉద్యమం
ఒక దేశం సమైక్యముగా మనుగడ సాగించాలంటే కొన్ని నియమాలు పాటించాలి . దేశాధినేతలు మారినా పాలసీలలో స్థిరత్వం వుండాలి. వ్యాపార వర్గం పాలకులను శాసించే స్థాయికి ఎదగ కూడదు. ప్రభుత్వము తమను మోసగిస్తున్నదన్న భావన ప్రజలలో తలెత్త కూడదు.
1969 లో తెలంగాణా రాష్ట్రమును ఏర్పాటు చేసి వుండాల్సింది. 1973 లో ఆంధ్రా సీమ రాష్ట్రమును ఏర్పాటు చేసి వుంటే బాగుండేది. ఆంధ్ర ప్రదేశ్ ముఖ్య మంత్రి  హెలికాప్టర్ ప్రమాదంలో చనిపోయిన తర్వాత హడావిడిగా 'తెలంగాణా ఏర్పాటు ప్రక్రియ ప్రారంభిస్తున్నాం ' అంటూ 2009 లో చిదంబరం ప్రకటించడాన్ని ఎలా అర్ధం చేసుకోవాలి?
100 కోట్లు ముడుపులుగా స్వీకరించి కేంద్ర ప్రభుత్వం లోని కీలక వ్యక్తులు తెలుగు రాష్ట్రాన్ని విభజించడానికి సిద్ధ పడినారని ఆంధ్రా సీమ ప్రజలు గ్రహించి తిరగబడ్డారు. శ్రీ కృష్ణ కమిటీ ఏర్పాటు ద్వారా ఆంధ్రా సీమ ప్రజల ఆగ్రహాన్ని చల్లార్చారు. తీసుకున్న ముడుపులకు ప్రతిగా అధికారాన్ని కోల్పోవడానికి కొద్ది మాసాల ముందు 2013 లోనే తెలంగాణా ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకున్నారు .
షిండే , దిగ్విజయ్ , చిదంబరం , ఆంథోని - ఇది దుష్ట చతుష్టయం.
ఉద్యమం పేరున సామాన్యులను శిక్షించడం సరైన పద్ధతి కాదు .
ఉత్తరాదికి చెందిన వ్యాపారస్తుల వద్ద ఏ వస్తువులు కొనకండి .
తమిళనాడు నుండి వస్తువుల దిగుమతులను ఆపండి .
పెప్సీ , కోలా పానీయాలను బహిష్కరించండి .
అన్ని కంపెనీల కారుల అమ్మకాలు నిలిపేయండి.
దుష్ట చతుష్టయం కేంద్ర మంత్రి వర్గం లో కొనసాగినంత కాలం ఎన్నికలను బహిష్కరించండి
మోహన
ఆంధ్రా సీమ ప్రజా పరిషత్

Sunday, August 18, 2013

ఆంధ్రా సీమ ప్రజా పరిషత్

 ఆంధ్రా సీమ ప్రజా పరిషత్
తెలంగాణా ప్రజలు వేరు కుంపటి పెట్టుకుంటా మంటే ఆంధ్రా సీమ ప్రజలు అభ్యంతరం చెప్పడం సబబు కాదు. అలాగే తెలంగాణా వాదులు హైదరాబాద్ తమ స్వంతమే అనడము సబబు కాదు . గతంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు చేసిన అప్పులు తీర్చకుండా రాష్ట్రాన్ని విభజించడం తప్పు .
కేంద్ర ప్రభుత్వం తమను మోసం చేసిందన్న భావన ఆంధ్రా సీమ ప్రజలలో బలంగా వుంది .  

Tuesday, August 13, 2013

ఆంధ్రా సీమ ఉద్యమానికి ఊపిరి

ఆంధ్రా సీమ ఉద్యమానికి ఊపిరి
ఉద్యమం అంటే మనల్ని మనం హింసించు కోవడం కాదు . ఉద్యమం అంటే బందులు రాస్తా రోకోలు కాదు .
ఉద్యమం అంటే అగ్ని గోళం . దాని అగ్ని కీలల్ని చూడాలంటే ప్రత్యర్ధుల గుండెల్లో దడ పుట్టాలి. ఉద్యమ సెగల్లోంచి నాయకులు పుట్టుకొస్తారు . ఆంధ్రా సీమ ప్రజల సత్తా ప్రపంచానికి చాటాలి.
ఉద్యమ నినాదం 'జై ఆంధ్రా జై సీమ '
మన ఆత్మాభిమానాన్ని కించ పరిచే విధముగా మాట్లాడే వారితో సహజీవనం ప్రగతికి విఘాతం.

Saturday, August 10, 2013

ఆంధ్రా సీమ రక్షణ సమితి

1. ఆంధ్రా సీమ రాష్ట్రము కొరకు పోరాడండి .2.రాష్ట్రమును సమైక్యముగా ఉంచమని గాని, విభజించమని గాని కోరే హక్కు ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వోద్యోగులకు లేదు. వీరి సమ్మె ప్రజా వ్యతిరేకం.  వీరు సిగ్గు లేకుండా సమ్మె కాలానికి వేతనం అడుగుతారు. ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వ యంత్రాంగము అవినీతి పరులతో నిండి పోయింది. ఆ ఉద్యోగులు మనకు వద్దు.
3.కాంట్రాక్టుల పేరుతో ప్రజా ధనాన్ని రాజకీయ నాయకులు, అధికారులు , కాంట్రాక్టర్లు కలిసి లూటీ చేసిన వైనం ప్రజలకు తెలుసు. కావున ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వము చేసిన అప్పులతో ఆంధ్రా సీమ రాష్ట్రము నకు సంబంధము లేదు.
హైదరాబాద్ ను అమ్మి అప్పులు తీర్చు కో వచ్చు .
4.విద్యార్ధులు ఒక సంవత్సర కాలం క్లాసులు బహిష్కరించాలి. మన ఆంధ్రాసీమ రాష్ట్రము ఏర్పడిన తరువాత పరీక్షలు వ్రాయకుండానే పై తరగతికి ప్రోమోట్ చేయబడతారు .
5.గురువారం రోజు ఆంధ్రాసీమ రాష్ట్రము నుండి తెలంగాణా రాష్ట్రము వైపు వెళ్ళే దారుల్లో 'సడక్ బంద్ ' చేయండి.
6. హైదరాబాద్ లో తయారైన వస్తువులను బహిష్కరించండి . హైదరాబాదు కు ఆహార పదార్దముల ఎగుమతులను నిలుపుదల చేయండి .
7. మన విద్యార్ధులకు హిందీ బోధనను నిలుపు చేయండి .

  

Saturday, August 3, 2013

విద్యార్ధులకు సూచనలు
1. సమైక్య నినాదం విడనాడండి. రాష్ట్రము యింకా విడిపోలేదు . ఆంధ్రా సీమ విద్యార్ధుల అనుమతి లేకుండా తెలుగునాట ఎన్నికలు జరుగవు , ప్రభుత్వాలు నడవవు . తెలంగాణా ప్రజలు విడిపోవాలంటే విభజనే లక్ష్యముగా ఏర్పడిన TRS ను ఏక పక్షముగా గెలిపించి వుండే వారు . రాజకీయములో సెంటిమెంటు గురించి మాట్లాడడం అవివేకం . భారత దేశం నుండి విడిపోవాలని కాశ్మీరు లో సెంటిమెంటు బలంగా వుంది . Democracy requires a clear verdict not sentiment. దిగ్విజయ్ సింగ్ కి భారీగా ముడుపులు ముట్టాయి . అతడు క్రిమినల్ . తెలుగు జాతి అతనిని శిక్షించి తీరాలి .
2. విద్యార్ధులు సుదీర్ఘ పోరాటానికి సిద్ధ పడాలి . సంవత్సర కాలం తరగతులను బహిష్కరించండి . పరీక్షలు వ్రాయకుండానే పై తరగతికి ప్రమోట్ చేయబడతారు . గ్రామీణ విద్యాలయాలను మూయించండి .
3. 

ఆంధ్రా సీమ రాష్ట్రము

ఆంధ్రా సీమ రాష్ట్రము
జై ఆంధ్రా ఉద్యమం చల్లారిన  40 సంవత్సరాల తర్వాత తెలుగు ప్రజలను ఉత్తరాది వెధవలు చీలుస్తున్నారు . కాంగ్రెస్ అనగా సోనియా భజన సమాజం . భజన చేసే గొర్రెలను సలహా అడిగేదేముందిలే అని ఇటాలియన్ బుర్ర చక చకా నిర్ణయం తీసుకుంది . ఇప్పుడు గొర్రెలు రాజీనామా చేస్తా మని ఏడుస్తున్నాయి . వీరు ఇప్పుడు రాజీనామా చేస్తారు . ఉద్యమం వేడి తగ్గగానే రాహుల్ గాంధి ముందు మోకరిల్లుతారు . కొత్త రాష్ట్రము కొరకు ఇచ్చే నిధులను కాజేయడానికి పోటీ పడతారు .
BJP ని భారతీయ చవటల పార్టీగా పిలవాలి .
TDP తెలుగు ద్రోహుల పార్టీగా పిలవాలి .
ఆంధ్రాసీమ రాష్ట్రము నుండి గొర్రెల కాంగ్రెస్ తో సహా TDP, BJP లను శాశ్వతముగా వెలివేయాలి .

Thursday, January 17, 2013

రాయలసీమ భవిష్యత్తు

రాయలసీమ భవిష్యత్తు గురించి రాయలసీమ వాసులు త్రికరణ శుద్ధిగా ఆలోచించి స్పందించ వలసిన తరుణం ఆసన్నమైనది. రాష్ట్ర విభజన తర్వాత మీరు స్పందించినా ప్రయోజనం ఉండదు.
వ్యాపార వర్గానికి చెందిన రాజకీయ నాయకులు తమ స్వీయ ప్రయోజనాల కోసం సామాన్యుల భవిష్యత్తును పణంగా పెడతారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాలలో తమ ఆస్తుల రక్షణే ధ్యేయముగా వీరి చర్చలు కొనసాగుతాయి. తెలంగాణాలో తమ ఆస్తులకు, పరిశ్రమలకు రక్షణ కల్పిస్తామని తెలంగాణా రాజకీయ శక్తుల వద్ద స్పష్టమైన హామీ పొందిన తర్వాత సీమ నాయకులు చర్చలను నీరు కారుస్తారు. ఆస్తుల రక్షణకు వీరు తెలంగాణా శిబిరంలో చేరుతారు. తెలంగాణాలో ఆస్తులు, ఆర్ధిక లావాదేవీలు గలవారిని రాష్ట విభజన చర్చలకు దూరంగా వుంచడం శ్రేయస్కరం.
చర్చనీయ అంశాలు :
1.అప్పులు 
ఆంద్ర ప్రదేశ్ ప్రభుత్వము చేసిన అప్పులను రాష్ట్ర విభజనకు ముందే తీర్చాలి. రాష్ట్రములోని ధనవంతుల ఆస్తులను స్వాధీనము చేసికొని వున్న అప్పులు తీర్చ వలెను. 100 కోట్లకు  పైబడి  వ్యక్తుల వద్ద వున్న స్థిర  చరాస్తులను  జప్తు  చేయాలి. ప్రభుత్వము  చేసిన  అప్పులను  తీర్చడానికి  అవి సరిపోక పోతే, తదుపరి  చర్యగా  50 కోట్లకు  పైబడి  వ్యక్తుల వద్ద వున్న స్థిర  చరాస్తులను  జప్తు  చేయాలి.  అవి చాలక పోతే యింకా  దిగువకు  రావాలి.
2.పెండింగ్ ప్రాజెక్టులు 
   'రాష్ట్రములోని యంత్రములు, కర్మాగారములు, ట్రాక్టర్లు, టిప్పర్లు, బుల్డోజర్లు,  ప్రొక్లేన్లు, లారీలు, బస్సులు, కారులు మరియు యింధనముతో నడిచే అన్ని రకముల పరికరములు ప్రభుత్వము కొరకు సంవత్సరానికి  12 రోజులు ఉచితముగా పనిచేయాలి.' అని  శాసనము  చేయాలి.  వీటికి అవసరమైన యింధనమును ప్రభుత్వము సమకుర్చాలి. ఈ విధానము అమలు వలన నదుల అనుసంధానమునకు, రోడ్లు నిర్మాణమునకు, భవనములు కట్టించడానికి, నీటి పారుదల ప్రాజెక్టులు నిర్మించడానికి అవసరమైన వొనరులు  సమకూరుతాయి. 

    రాజకీయ నాయకుల మరియు ఉద్యోగుల వుమ్మడి దోపిడీని అరికట్టాలంటే ఓటు హక్కు గల పౌరులు సంవత్సరములో 12 దినములు రాష్ట్ర ప్రభుత్వము కొరకు ఉచితముగా పనిచేయాలి.  ఈ విధానము వలన అనేక ఉపయోగాలున్నాయి.   ప్రభుత్వ కార్యాలయములలో ప్రజలు పని చేయుట వలన అవినీతి పునాదులు కదిలి పోతాయి. రాష్ట్రములోని నదుల అనుసంధానమునకు అవసరమైన మానవ శక్తి లభ్యమౌతుంది.
 3.ప్రభుత్వోద్యోగులు 
ప్రజల జీవన ప్రమాణాలకు అనుగుణముగా వారి సేవకై నియుక్తులైన వారి జీవన ప్రమాణాలు పెరగాలి.